వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో మధుకొడాలున్నారు: రాయపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambhasiva Rao
న్యూఢిల్లీ: రాష్ట్రంలో మధుకొడాల సంఖ్య పెరుగుతోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం తన పార్టీ నాయకులపై సంచనల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యులు కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గంలో అవినీతి పరులున్నారని, వారిని మంత్రి వర్గం నుంచి తొలగించడం మంచిదని ఆయన అన్నారు. ఐఎఎస్ అధికారులపైనే కాకుండా మంత్రులపై కూడా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులు చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తాను ఇది వరకే ఎసిబి చీఫ్ అరవింద్ రావుకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు సభ్యులు కూడా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

పార్టీకి సేవలందించినవారిని విస్మరించకూడదని ఆయన అన్నారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని, తద్వారా తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ కు విజ్ఝప్తి చేశారు. అందుకు సోనియా సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. తనకు సహాయ మంత్రి పదవి అక్కర్లేదని, కేబినెట్ పదవి కావాలని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కమ్మవర్గానికి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X