గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్లుండి పీఠాధిపతుల మహా సదస్సు

By Santaram
|
Google Oneindia TeluguNews

Chinna Jeeyar Swami
తాడేపల్లి: సీతానగరంలోని చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి స్థాపించిన వేద విశ్వవిద్యాలయంలో ఈ నెల తొమ్మిదో తేదీన పీఠాధిపతుల సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని వివిధ పీఠాలకు చెందిన 38 మంది పీఠాధిపతులు, ఐదుగురు మాతాజీలు సమావేశానికి హాజరుకానున్నారు. త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి మంగళ శాసనాలతో, అహోబల రామానుజ జీయర్‌స్వామి ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతుంది. భారతీయ సంస్కృతీసంప్రదాయాల విలువలు పరిరక్షించడం, జాతి సమైక్యత, ఔన్నత్యాన్ని చాటడం ఈ సమావేశం ప్రధానోద్దేశంగా వేద పాఠశాల వర్గాలు తెలిపాయి.

విజయవాడకు చెందిన అష్టాక్షరీ ఆశ్రమ సంపత్కుమార రామానుజీయర్‌స్వామి, రామతీర్థ సీతాశ్రమాధిపతి అచ్చుతానందగిరి, ముషీరాబాద్‌లోని హిందూ ధర్మాద్ధరణ పీఠాధిపతులు కమల్‌కుమార్‌స్వామి, మహబూబ్‌నగర్‌ పద్మబ¬షి పీఠాధిపతి పాండురంగ యోగా గురూజీస్వామి, నిజామాబాద్‌ జిల్లా నుంచి శాంతాశ్రమ ఆనందానందగిరి స్వామి, బ్రహ్మవిద్యా యోగాశ్రమ సచ్చిదానందగిరిస్వామి, గంగాధరానందగిరిస్వామి, దత్తాత్రేయాశ్రమ సత్యానందపురిస్వామి, మెదక్‌ జిల్లాలోని సంత్‌సంగ్రామ్‌ మహరాజ్‌ రాజయోగి వెంకటస్వామి, కర్ణాకటలోని హంపీకి చెందిన విరూపాక్షా విద్యారణ్య మఠాధిపతి విరూపాక్షానంద భారతిస్వామి తదితరులు పాల్గొననున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X