హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
వాషింగ్టన్: అమెరికాలోని పశ్చిమ వర్జీనియాలో జరిగిన కారు ప్రమాదంలో కాసాని ప్రణీత అనే 20 ఏళ్ల తెలుగు విద్యార్థిని మరణించింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. గురువారం ఉదయం వెస్ట్ వర్జీనియా నుంచి ఓహ్యోలోని తన ఇంటికి ఐదుగురు మిత్రులతో కలిసి ప్రణీతాదేవి తన ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రణీతా దేవి తండ్రి కాసాని రామారావు హైదరాబాదులోని ఫలక్ నుమాలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టరుగా పనిచేస్తున్నారు. ప్రణీత అమెరికాలో ఎంఎస్ చదువుతోంది.

పునీతా రెడ్డి అనే 22 ఏళ్ల యువతి కారు నడుపుతోందని, కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొనడంతో ప్రణీతా దేవి ఎగిరి కింద పడిందని. దీంతో ప్రణీత అక్కడికక్కడే మరణించింది. గాయపడిన వారికి ఏ విధమైన ప్రాణహానీ లేదు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో వారు డిశ్చార్జీ అవుతారు.

2009లో హైదరాబాదులో బిటెక్ పూర్తి చేసిన ప్రణీత ఓహ్యోలోని రైట్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమెకు ఓ సోదరి ఉంది. వెంకట్ కొండూరి, హారిక వంగేటి, పవన్ కుమార్ రాఘవజ్జల, పుణీతా రెడ్డి అమరెల్ల, మద్దాలి సంతోష్ గాయపడ్డారు. మంగళవారం ప్రణీత మృతదేహం హైదరాబాదుకు చేరుకుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X