విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదాల్లో 25 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Andhra Pradesh Map
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు రక్తమోడాయి. రాష్ట్రంలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 25 మంది మరణించారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. విశాఖపట్నంలో సింథియా వద్ద ఆయిల్ ట్యాంకర్ లారీ, ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వద్ద సిమెంట్ లారీ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా ఆంధ్రా - కర్నాటక సరిహద్దులో లారీ, డిసిఎం వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. బాధితులు కర్నాటక రాష్ట్రానికి చెందినవారు. కరీంనగర్, మెదక్ తదితర జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరో 11 మంది మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X