వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన వాదనే నెగ్గింది: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: కెజి బేసిన్ గ్యాస్ విషయంలో సుప్రీంకోర్టులో తమ వాదనే నెగ్గిందని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. అంబానీ సోదరుల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడుతామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా తమ వాదనలు వినిపిస్తామని ఆయన చెప్పారు.

మన రాష్ట్రంలో గ్యాస్ ఉత్పత్తి అవుతోంది కాబట్టి గ్యాస్ కేటాయింపుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు ఇతోధిక తోడ్పాటు అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రమే రాష్ట్రాల మధ్య గ్యాస్ కేటాయింపు జరుపుతుందని, ఆ సమయంలో మనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X