బెజవాడలో ప్రజల వద్దకు పోలీసులు!

Vijayawada
విజయవాడ: విజయవాడ పోలీసులు మరో వినూత్న కార్యక్రం చేపట్టారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. 'మే ఐ హెల్ప్‌ యూ' పేరుతో మొబైల్‌ బూత్‌ను ఏర్పాటు చేసినట్లు శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఒక పోలీసు వాహనాన్ని ఇందుకోసం కేటాయించారు. ఈ వాహనం ప్రతిరోజూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా జనం సంచారం తక్కువగా ఉండి, పోలీసులు వెళ్లని ప్రాంతాల్లో తిరుగుతుంటుంది. వివిధ ప్రాంతాల్లోని సందులు గొందుల్లో ఈవ్‌టీజింగ్‌, గొడవలు, ఘర్షణలు, దొంగతనాలు తదితర వాటిని నివారించడానికి ఈ మొబైల్‌ బూత్‌ను ఏర్పాటుచేశారు.

డీసీపీ విజయ్‌ కుమార్‌ పరిస్థితిని బట్టి ఈ వాహనం ఏరోజు ఎక్కడుండాలో నిర్ణయిస్తారు. ఈ బూత్‌ కు ఒక ఎస్‌ ఐని ఇన్‌ చార్జిగా నియమించి ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు. ప్రజలు తమ సమస్యలను ఈ బూత్‌ కు లిత పూర్వక ఫిర్యాదు చేస్తే అక్కడికక్కడే రశీదు ఇస్తారు. ఆ తర్వాత సంబంధిత పోలీస్‌ స్టేషన్లు, బ్లూకోల్ట్‌ లకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కరిస్తారు. ఫిర్యాదులే కాకుండా ప్రజలు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఈ బూత్‌ లో ఇవ్వొచ్చు. దీనివల్ల ప్రజలు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లకుండా తమ దగ్గరికే వచ్చిన వారికి సమస్యలు చెప్పుకోవచ్చు.

పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ప్రయోగాత్మకంగా ఈ మొబైల్‌ బూత్‌ ను ఏర్పాటుచేసినట్లు సీపీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చెప్పారు. ప్రజల ఆదరణను బట్టి ఇందులో మార్పులు చేర్పులు చేస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+