బెజవాడలో ప్రజల వద్దకు పోలీసులు!
డీసీపీ విజయ్ కుమార్ పరిస్థితిని బట్టి ఈ వాహనం ఏరోజు ఎక్కడుండాలో నిర్ణయిస్తారు. ఈ బూత్ కు ఒక ఎస్ ఐని ఇన్ చార్జిగా నియమించి ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు. ప్రజలు తమ సమస్యలను ఈ బూత్ కు లిత పూర్వక ఫిర్యాదు చేస్తే అక్కడికక్కడే రశీదు ఇస్తారు. ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్లు, బ్లూకోల్ట్ లకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కరిస్తారు. ఫిర్యాదులే కాకుండా ప్రజలు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఈ బూత్ లో ఇవ్వొచ్చు. దీనివల్ల ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా తమ దగ్గరికే వచ్చిన వారికి సమస్యలు చెప్పుకోవచ్చు.
పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ప్రయోగాత్మకంగా ఈ మొబైల్ బూత్ ను ఏర్పాటుచేసినట్లు సీపీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారు. ప్రజల ఆదరణను బట్టి ఇందులో మార్పులు చేర్పులు చేస్తామని తెలిపారు.
Comments
Story first published: Sunday, May 9, 2010, 10:40 [IST]