కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గొంతు కోసి భార్యను చంపిన భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadapa
కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులోని బాలాజీ కాలనీలో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ప్రొద్దుటూరులో తీవ్ర సంచలనం సృష్టించింది. బాలాజీ కాలనీలో నివాసం ఉంటున్న రహ్మతుల్లా అనే వ్యక్తి తన భార్య తలపై రోకలిబండతో మోది తర్వాత గొంతు కోశాడు. దీంతో ఆమె మరణించింది. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది.

భార్యను హత్య చేసి రహ్మతుల్లా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డబ్బుల విషయంలో చెలరేగిన వివాదం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X