హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నక్సల్స్ ప్రాంతాల్లో భద్రత పెంపు: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో భద్రతను పెంచాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన మంగళవారం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, హైదరాబాదులోని పాతబస్తీలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డిజిపి గిరీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. నక్సల్స్ ఏదైనా సంఘటనకు పాల్పడినప్పుడు ఆ ఘటన జరిగిన చోటికి వెంటనే చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సంఘటనలు జరిగిన ప్రాంతాలకు చేరుకుంనేందుకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతామని కూడా ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X