వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు వేదాద్రికి 'సింహా' బాలకృష్ణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Balakrishna
జగ్గయ్యపేట: హీరో నందమూరి బాలకృష్ణ మండల పరిధిలోని వేదాద్రి గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్షీనరసింహా స్వామిని బుధవారం దర్శించుకోనున్నారు. నరసింహాస్వామి భక్తుడైన బాలకృష్ణ 2004లో తొలిసారి వేదాద్రికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనే సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌తో బాలకృష్ణకు విభేదాలు రావడం, హత్యాయత్నం కేసు నమోదుకావడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

కేసు నుంచి బయటపడిన అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆయన నటించిన తాజా చిత్రం 'సింహాా' విజయం సాధించడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు మరోమారు ఇక్కడకు వస్తున్నారు. ఈమేరకు మంగళవారం బాలకృష్ణ పర్యటనపై స్థానిక పార్టీ నాయకులకు సమాచారమందింది. అభిమాననటుని రాకను పురస్కరించుకొని స్వాగతం పలికేందుకు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X