బాలయ్య ఫ్యాన్స్ పై వేదాద్రిలో లాఠీచార్జి
అయితే పోలీసులు వారిని అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ అభిమాని గాయపడ్డారు. దాంతో వారు పోలీసు జూలుం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు.
బాలకృష్ణ బుధవారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలోని యోగానంద లక్ష్మీనరసింహా స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'సింహా' చిత్రం విజయవంతమైన నేపథ్యంలో బాలకృష్ణ రాష్ట్రంలోని ప్రముఖ నరసింహాస్వామి దేవాలయాలను సందర్శించనున్నారు.
దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని పానకాల స్వామిని దర్శించుకుంటారు. ఆయన రాత్రికి విజయవాడలో బస చేస్తారు. గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాఅంతర్వేది ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ యాత్రల్లో చిత్రదర్శక, నిర్మాతలు పరుచూరి కిరీటి, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొంటారు.