వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్య ఫ్యాన్స్ పై వేదాద్రిలో లాఠీచార్జి

By Santaram
|
Google Oneindia TeluguNews

Balakrishna
జగ్గయ్యపేట: సినీనటుడు బాలకృష్ణ అభిమానులపై బుధవారం పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. వేదాద్రిలోని యోగానంద లకీనరసింహాస్వామి ఆలయాన్ని బాలకృష్ణ దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తన అభిమాన నటుడిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

అయితే పోలీసులు వారిని అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో ఓ అభిమాని గాయపడ్డారు. దాంతో వారు పోలీసు జూలుం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు.

బాలకృష్ణ బుధవారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలోని యోగానంద లక్ష్మీనరసింహా స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'సింహా' చిత్రం విజయవంతమైన నేపథ్యంలో బాలకృష్ణ రాష్ట్రంలోని ప్రముఖ నరసింహాస్వామి దేవాలయాలను సందర్శించనున్నారు.

దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని పానకాల స్వామిని దర్శించుకుంటారు. ఆయన రాత్రికి విజయవాడలో బస చేస్తారు. గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాఅంతర్వేది ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ యాత్రల్లో చిత్రదర్శక, నిర్మాతలు పరుచూరి కిరీటి, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X