రేపు హనుమాన్ జంక్షన్ కు చిరంజీవి
పిఆర్పి జిల్లా అధ్యక్షుడు దనేకుల మురళీ మోహన్ సారధ్యంలో జిల్లా నేతలు జంక్షన్ నుండే ఘన స్వాగతం పలకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం హనుమాన్ జంక్షన్లో పిఆర్పి జిల్లా ఉపాధ్యాక్షుడు చెలమల శెట్టి రమేష్ బాబు, నక్కా గాంధీ, విలేకర్లతో మాట్లాడుతూ చిరంజీవి బస్సు యాత్రను దిగ్విజయం చేయటానికి పార్టీ కార్యకర్తలు, కృషి చేయాలని కోరారు. కాగా జంక్షన్లోని ప్రసిద్ది చెందిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చిరంజీవి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలోనే ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్థానిక వైద్య ప్రముకుడు డాక్టర్. దుట్టా రామచంద్రరావు ను మెగస్టార్ చిరంజీవి పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. అప్పనవీడు పిఆర్పి నాయకుడు అప్పన కనకదుర్గా ప్రసాద్, బారీ ప్లెక్సీలు, బ్యానర్లు, కట్ అవుట్ లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా కలపర్రు గ్రామం నుండి కోడూరు పాడు గ్రామం వరకు జాతీయ రహదారి పై పిఆర్పి జెండాలు బ్యానర్లు, ప్లెక్సీలను ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.