ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులిచింతల పనులు వేగవంతం

By Santaram
|
Google Oneindia TeluguNews

Pulichintala Project
జగ్గయ్యపేట: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగవంతమైనట్టు కనిపిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పనులను 2011 జూన్‌ నాటికి పూర్తిచేసే లక్ష్యంతో పనులు చేస్తున్నట్లు ఒంగోలు జిల్లా చీఫ్‌ ఇంజినీర్‌ డి.సుబ్బయ్య తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ ఇప్పటివరకు ఒంగోలు ఇరిగేషన్‌ కార్యాలయ పరిధిలో వెలిగొండ, గుండ్లకమ్మ, రామతీర్థం, కొరిసిపాడు ప్రాజెక్టులు ఉన్నాయని, ఈ ఏడాది మే ఆరో తేదీన పులిచింతలను కూడా ఈ కార్యాలయ పరిధిలోకి చేర్చటం జరిగిందని చెప్పారు.

గతంలోలా పులిచింతల సాంకేతిక అనుమతుల కోసం హైదరాబాద్‌లోని చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదని, ఇకపై ఒంగోలులోనే అనుమతులపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని వివరించారు. ఇందులో భాగంగా తాను పులిచింతలను పరిశీలించానన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రోజుకు 800 మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఎండ వేడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లోనే కాంక్రీట్‌ పనులు నిర్వహిస్తున్నామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X