వైయస్ ప్రమాదంలో కుట్ర లేదు: సిబిఐ
ప్రమాదంపై అన్నికోణాల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. చాలామంది సాక్షులను విచారించామని, బెంగుళూరుకు చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్, హైదరాబాద్-న్యూఢిల్లీ-ఛండీగడ్లకు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్, ఢిల్లీలోని రోటరీ వింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్లోని జె.ఎన్.టి.యు., నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్కు చెందిన నిపుణులతోపాటు ఇతరుల సాయం కూడా తీసుకున్నామని సీబీఐ వెల్లడించింది.
హెలికాప్టర్ నిర్వహణలో నిర్లక్ష్యం కనిపించిందని, దీనికి సంబంధించి హెలికాప్టర్ నిర్వహణ ఇంజినీరు లక్ష్మణరావుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సీబీఐ సూచించింది. భవిష్యత్తులో ఇటువంటివి జరుగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలనూ నివేదికలో పొందుపరిచింది. ముఖ్యంగా వీఐపీలు ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన ఈ హెలికాప్టర్ ప్రమాదంపై త్యాగీ నేతృత్వంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎం.ఆర్.రెడ్డి, కోసాలతో కూడిన ద్విసభ్య కమిటీ ఇప్పటికే నివేదికను సమర్పించాయి.