వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలకు మావోలకు చిదంబరం పిలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: హింసకు స్వస్తి చెప్పి చర్చలకు రావాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం నక్సలైట్లకు తాజాగా పిలుపునిచ్చారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో మావోయిస్టులు దాడి చేసి 40 మందిని హతం చేసిన నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. ఏ తేదీతోనైనా ప్రారంభించి నక్సలైట్లు 72 గంటల పాటు హింసకు స్వస్తి చెప్పాలని ఆయన ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఈ 72 గంటల్లో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలను పిలిపించి నక్సల్స్ తో చర్చలకు తేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.

ఎజెండాలో మావోయిస్టులు ఏమైనా చేర్చవచ్చునని, అయితే చర్చల కాలంలో హింసకు పాల్పవడవద్దని ఆయన అన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం కూడా ఏ విధమైన ఆపరేషన్ చేపట్టదని ఆయన హామీ ఇచ్చారు. ఇంతకు ముందు ప్రభుత్వం కూడా సమస్యను తక్కువ అంచనా వేసిందని ఆయన అన్నారు. నక్సలిజాన్ని అదుపు చేయడానికి రెండు, మూడేళ్లు పడుతుందని ఆయన చెప్పారు. తాము వైమానిక దాడుల గురించి మాట్లాడడం లేదని ఆయన చెప్పారు. తనకు ఉన్న పరిమితుల్లో చర్యలు తీసుకుంటున్నానని, విస్తృత చర్యల కోసం కేంద్ర క్యాబినెట్ కమిటీలో చర్చిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X