హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నాపై సిఎంకు ఫిర్యాదు చేయలేదు: రాయపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambhasiva Rao
హైదరాబాద్: భారీ పరిశ్రమల మంత్రి కన్నా లక్ష్మినారాయణపై తాను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయలేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతమైన కారణాలతోనే తాను ముఖ్యమంత్రిని కలిశానని ఆయన చెప్పారు.

ఇప్పటికే కేంద్ర నిఘా విభాగం కన్నా లక్ష్మినారాయణపై విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కన్నాపై ఆరోపణల వ్యవహారాన్ని కేంద్రమే చూసుకుంటుందని ఆయన చెప్పారు. రాష్టంలో కూడా కన్నాపై లోకాయుక్తతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X