హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుపాను ముప్పు తీవ్రం: మర్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Marri Sasidhar Reddy
హైదరాబాద్‌: రాష్ట్రంలో తుఫాను ముప్పు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని జాతీయ విపత్తు నివారణ కమిటీ సభ్యుడు, శాసనసభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి వివరించారు. ఈ తుపాను తీవ్రత మన రాష్ట్రంలో కోస్తా జిల్లాలపై బలంగా ఉండే అవకాశముందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం సచివాలయంలో జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశం తుపాను తీవ్రతపై తాజా పరిస్థితిని అంచనా వేసిందని ఆయన చెప్పారు. సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాల్సిందిగా కోస్తా ప్రాంత మంత్రులంతా ఆయా జిల్లాలకు మంత్రి వర్గ సమావేశం అనంతరం వెళ్లి అక్కడే ఉంది పరిస్థితి సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు రాష్ట్రానికి రేపు ఉదయం కల్లా చేరుకుంటాయని శశిధర్‌రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X