హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలవంతంగానైనా తరలించండి: ధర్మాన

By Pratap
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao
హైదరాబాద్: తుపాను ముప్పు పొంచి ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను బలవంతగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఒడిషా, చెన్నైల నుంచి రాష్ట్రానికి 8 విపత్తు నివారణ బృందాలు వచ్చాయని, వీటిని సరిహద్దు జిల్లాల్లో మోహరించామని ఆయన చెప్పారు.

ఇదిలా వుండగా, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గీతారెడ్డి సూచించారు. తుపాను మప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆమె బుధవారం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీడియా ప్రతినిధులకు వివరించారు. తుపాను హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాలకు అత్యవసర అవసరాలైన మందులు, అంబులెన్సులు తదితర సదుపాయాలను అందుబాటులో ఉంచామని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X