కృష్ణా జిల్లాలో కెవిపి 'సునామీ'!
కేవీపీని కల్సినవారిలో చింతలపూడి, ఏలూరు ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్కుమార్, ఆళ్ల నాని, విజయవాడ సీపీ సీతారామాంజనేయులు, జిల్లా ఎస్పీ హరికుమార్, నూజివీడు ఏఎస్పీ బీ రాజకుమారి, ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఏవీ కృష్ణంరాజు, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, పశ్చిమగోదావరి జిల్లా గవర్నమెంటు ప్లీడరు మద్దిపాటి సునీతలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులున్నారు.
అంపాపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నెలకొల్పాల్సిందిగా సర్పంచ్ కడియాల రమేష్ కేవీపీని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. కేవీపీ రాకను పురస్కరించుకొని సోమవారం రాత్రి నుంచి అంపాపురంలో భారీ పోలీస్బందోబస్తు ఏర్పాటుచేశారు. హైదరాబాద్ నుంచి రైల్లో వచ్చిన కేవీపీకి విజయవాడ రైల్వేస్టేషన్లో కాంగ్రెస్ పార్టీ బాపులపాడు మండల అధ్యక్షుడు వేగిరెడ్డి బాలాజీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వరిగంజి కిషోర్, ఎస్ఎన్ పాలెం ఉపసర్పంచ్ అడపా అంజిబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు చిన్నాల లకీనారాయణ, దుట్టా శివన్నారాయణ, వెలగపల్లిప్రదీప్, నూజివీడు మార్కెటింగ్ మాజీ డైరెక్టర్ దయాల విజయనాయుడు స్వాగతం పలికారు.