హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాగులో చిక్కుకున్న 20 మంది

By Pratap
|
Google Oneindia TeluguNews

20 persons in rivulet
హైదరాబాద్‌: ప్రకాశం జిల్లా నాగులప్పపాడు మండలం రేగులగుంట వాగులో 20 మంది చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో తాళ్ల సాయంతో వారిని ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, నెల్లూరు జిల్లా తడ వద్ద సముద్రంలోకి వేటకు వెళ్లిన 50 మంది జాలర్లు దారి తప్పారు. దీంతో వారి కోసం సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వారి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

కోస్తా తీర ప్రాంతంలో వాతావరణం సరిగా లేకపోవడంతో సమాచార వ్యవస్థ స్తంభించింది.ఒంగోలు, కందుకూరు, చీరాల, రేపల్లె, రామచంద్రాపురం, భీమవరం, ఏలూరు, తణుకు, పాలకొల్లు, బాపట్ల, మండపేట పట్టణాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఒంగోలు, కనిగిరిలలో దెబ్బతిన్న సబ్‌స్టేషన్లు దెబ్బ తిన్నాయి. 1492 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X