హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుఫాను: 40 వేల మంది తరలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Cyclone Laila
హైదరాబాద్‌: తుఫాను ముప్పు పొంచి ఉన్న రాష్ట్రంలోని తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలకు చెందిన 40 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను దిశ మార్చుకుని బలహీనపడిందని భావిస్తున్నప్పటికీ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. తీర ప్రాంతంలోని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ముప్పు తప్పిపోలేదని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు అంటున్నారు.

అవసరమైనప్పుడు రంగంలోకి దిగడానికి సైన్యం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ చెప్పారు. నావికా దళంతో పాటు ఇతర సాయుధ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను తుఫాను ప్రభావం తాకింది. తుఫాను తీరం దాటే సమయంలో మరింతగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో పెట్టామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X