చీకట్లో నెల్లూరు: మచిలీపట్నం జలమయం
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం జలమయమైంది. బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కృష్ణాజిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 18 మండలాల్లోని 233 గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలో ఉన్న ఆరు మండలాలోని దాదాపు మూడు వేలమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను ప్రభావిత మండలాల్లో ప్రజలను తరలించేందుకు ప్రత్యేకంగా 40 బస్సులను అధికారులు సిద్ధం చేశారు.
Comments
Story first published: Thursday, May 20, 2010, 8:56 [IST]