ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాపట్ల వద్ద తీరం దాటిన లైలా తుఫాను

By Pratap
|
Google Oneindia TeluguNews

Cyclone Laila
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల వద్ద లైలా తుఫాను తీరం దాటింది. బాపట్లకు 50 కిలోమీటర్ల దూరంలో ఇది తీరం దాటింది. దీంతో తుఫాను గండం గడిచినట్లేనని భావిస్తున్నారు. తుఫాను తన దిశను కూడా మార్చుకుంది. దీంతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు మేలు జరిగే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో ఈ రెండు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుఫాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాను క్రమంగా బలహీనపడుతుందని భావిస్తున్నారు. తుఫాను తీరం దాటడంతో ప్రజలు తమ ప్రాంతాలను ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X