హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుఫాను: అప్రమత్తమైన ఆర్టీసి అధికారులు

By Pratap
|
Google Oneindia TeluguNews

APSRTC
హైదరాబాద్‌: లైలా తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. పరిస్థితిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. కోస్తా తీరంలోని పరిస్థితిని ఫోన్‌ ద్వారా తెలుసుకున్నారు. భారీ వర్షాలతో ప్రమాదాలు జరగకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమన్వయంతో రైళ్ల రాకపోకలను ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలిసేలా ఏర్పాటు చేశారు. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు.

తుపాను ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు. పరిస్థితిపై అన్ని రిజినల్‌ మేనేజర్లతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన చోట్ల బస్సుల రాకపోకల వివరాలను తెలిపేందుకు కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవిన్యూ అధికారులు కోరిన వెంటనే బస్సులను నడపాలని ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X