హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుపానుకు 17 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao
హైదరాబాద్: లైలా తుఫాను తాకిడికి 17 మంది మరణించారు. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు చెప్పారు. తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశానంతరం ధర్మాన ప్రసాద రావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తుఫాను ప్రభావం తగ్గు ముఖం పట్టిందని ఆయన చెప్పారు. ఈదురుగాలుల వేగం కూడా తగ్గిందని, ప్రస్తుతం గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో మాత్రమే గాలులు వీస్తున్నాయని ఆయన చెప్పారు.

తుఫాను తాకిడి ప్రాంతాల్లో 71 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరిలంచినట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో పదేళ్ల రికార్డు స్థాయిలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు. అద్దంకిలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. మొత్తం 1,047 గ్రామాలు తుఫాను తాకిడికి గురైనట్లు ఆయన తెలిపారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో 85 ఇళ్లు పూర్తిగా, 187 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని ఆయన చెప్పారు.

తుఫాను తాకిడి ప్రాంతాల్లో 70 వేల ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఐదు పశువులు, 2002 గొర్రెలు మరణించినట్లు ఆయన తెలిపారు. సమీక్షా సమావేశంలో ధర్మాన ప్రసాదరావుతో పాటు మంత్రులు గీతారెడ్డి, శత్రుచర్ల విజయరామ రాజు, గల్లా అరుణ, సునీత లక్ష్మారెడ్డి, కేంద్ర మంత్రి వనబాక లక్ష్మి, డిజిపి గిరీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X