విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో గోడ కూలి నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: విజయవాడలోని చిట్టినగర్ లో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మూడు రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ బాగా తడిసింది. దాంతో అది కూలి పక్కన ఉన్న గుడిసెపై పడింది. గోడతో పాటు కొండచరియ కూడా విరిగి పడింది. దాంతో ఇంట్లో నిద్రిస్తున్న దుర్గారావు కుటుంబ సభ్యులు మరణించారు.

కాగా, విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో విజయవాడలోకి విపరీతంగా నీరు చేరుతోంది. విజయవాడ పాతబస్తీ పూర్తిగా నీట మునిగింది. విజయవాడ మొత్తం డ్రైనేజీ వ్యవస్థ స్తంభించింది. విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దయ్యాయి. విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బ తింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X