హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మచిలీపట్నం వద్ద లైలా కేంద్రీకృతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Cyclone Laila
హైదరాబాద్‌: 'లైలా' తుపాను మచిలీపట్నం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం తెలిపింది.రాయలసీమలో ఓ మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్ర అధికార్లు తెలిపారు. గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, సూర్యలంక వద్ద సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. మచిలీపట్నానికి సమీపంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాను ఈశాన్యదిశగా పయనిస్తోందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. విజయనగరం మీదుగా ఒరిస్సా వైపు సాగుతుందని చెబుతున్నారు.

కోస్తాంధ్రకు తుఫాను గండం గడిచినప్పుటీకి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు వర్షం తాకిడికి గురయ్యాయి. విజయవాడలోకి పూర్తిగా నీరు వచ్చి చేరింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద యెత్తున వర్షాలు కురుస్తున్నాయి. పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బ తిన్నది. ఉభయ గోదావరి జిల్లాలకు తుఫాను గండం పూర్తిగా తప్పినట్లే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X