తూ.గోలో తొలగని తుపాను భయం
ఈ రహదారిపైకి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో జిల్లా యంత్రాంగం రాకపోకలను నిలిపివేసింది. ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితిని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జాయింట్ కలెక్టర్ కోన శశిధర్, ప్రత్యేకాధికారి జె.ఎస్.వి. ప్రసాద్, ఇరిగేషన్, ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్లు పరిశీలించారు. ఇదే ప్రాంతాన్ని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విడిగా సందర్శించి బాధితులను పరామర్శించారు. అల్లవరం మండలంలో పరిస్థితిని గ్రామీణ నీటిసరఫరా మంత్రి పినిపే విశ్వరూప్, ఎస్పీ జి. శ్రీనివాస్ సమీక్షించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పర్యటించి బాధితులను పలకరించారు. జిల్లావ్యాప్తంగా 15 పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో 3,672 మందికి భోజన వసతి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కేంద్రాలలో భోజనం అనంతరం బాధితులు తిరిగి వెళ్లిపోతున్నారు. తుఫాను ప్రభావం తగ్గిందనే సమాచారంతో అధికారులు కూడా వారిని చూసీచూడనట్టు వదిలేశారు.