హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశం జిల్లాలో రేపే రోశయ్య, బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: లైలా తుఫానుతో అస్తవ్యస్తమైన ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు శనివారం పర్యటించనున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఏరియల్‌ సర్వే ద్వారా లేకపోతే రోడ్డు మార్గం ద్వారా తుఫాను బాధిత గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు. నష్టాన్ని అంచనావేసి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా బాధితులను ఆదుకుంటారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ముఖ్యమంత్రి రోశయ్య ప్రకాశం జిల్లా శుక్రవారంనాటి పర్యటనను వాయిదా వేసుకున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన ఏరియల్‌ సర్వేకు వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవటంతో ఈ కార్యక్రమం శనివారానికి వాయిదాపడింది. లైలా తుఫాను ప్రభావం రానున్న 24 గంటలపాటు ఉంటుందని అధికారులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X