వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమాన ప్రమాదంపై విచారణ: ప్రఫుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Praful Patel
బెంగుళూరు / న్యూఢిల్లీ : మంగుళూరులో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై విచారణకు పౌర విమానయాన శాఖ ఆదేశించింది. గమ్యస్థానం చేరుకోబోతుండగా ఎందుకిలా జరిగిందో దర్యాప్తు చేస్తామని మంత్రి ప్రఫుల్‌పటేల్‌ తెలిపారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన వీరప్పమొయిలీతో కలిసి మంగుళూరు బయలుదేరి వెళ్లారు. ప్రమాద మృతులకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. యుపిఎ ప్రభుత్వ వార్షికోత్సవాలను కాంగ్రెసు పార్టీ రద్దు చేసుకుంది.

మంగళూరు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కర్ణాటక హోంశాఖమంత్రి ఆచార్య ప్రకటించారు. విమానప్రమాదంలో ప్రాణాలతో ఉన్న చిన్నారితో సహా మొత్తం ఏడుగురిని ఆసుపత్రిలో చేర్పించినట్టు ఆయన తెలిపారు. విమానప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమకనుమల్లో ఉన్న మంగళూరు విమానాశ్రయం చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. దీంతో ఇక్కడినుంచి విమానాల్ని టేకాఫ్‌ చేయడం ల్యాండింగ్‌ చేయడం క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X