వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైలట్ సమాచారం ఇవ్వలేదు: అగర్వాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Air India Express Aircraft
ముంబై: మంగళూర్ విమాన ప్రమాదంపై పైలట్ నుంచి తమకు ముందుగా ఎటువంటి సమాచారం అందలేదని ఆల్ ఇండియా ఎయిర్ పోర్ట్ అథారిటీ చైర్మన్ అగర్వాల్ చెప్పారు. ఈ ప్రమాదంపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. విమాన రాకపోకల నియంత్రణకు సంబంధించి ఎటువంటి లోపాలను కూడా తాము గుర్తించలేదని ఆయన అన్నారు.

విమానంలో సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రన్ వేలో ఏ విధమైన లోపాలు లేవని ఆయన స్పష్టం చేసారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలలోగా ప్రాథమిక నివేదికను అందిస్తామని ఆయన చెప్పారు. ఆయన ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X