సొరేన్ కు బిజెపి మద్దతు వెనక్కి
జెఎంఎం ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని గవర్నర్ ఫరూఖ్ ను కలిసే ముందు బిజెపి రాష్ట్రాధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి రఘువర్ ప్రసాద్ చెప్పారు. కోత తీర్మానంపై పార్లమెంటులో సొరేన్ యుపిఎ ప్రభుత్వానికి అనుకూలంగా వోటు వేసిన మరుక్షణం నుంచి జార్ఖండ్ లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. అయితే, సొరేన్ మంతనాలకు రావడంతో బిజెపి జెఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రభుత్వాని చెరి సగం కాలం పంచుకోవాలని బిజెపి, జెఎంఎం నిర్ణయానికి వచ్చాయి. ఈ నిర్ణయం మేరకు సొరేన్ బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉండింది. అయితే, ఆయన అందుకు నిరాకరించారు. దీంతో పరిస్థితి మొదటికి వచ్చింది. సొరేన్ తీరుతో విసిగిపోయిన బిజెపి జఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడమే మేలనే నిర్ణయానికి వచ్చింది.