వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎంగా రాహుల్ పై పార్టీదే నిర్ణయం: పిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమారుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, వద్దా అనే విషయంపై పార్టీదే నిర్ణయమని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. విజ్ఞాన్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతను అధికారంలోకి అహ్వానిస్తామని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రివర్గంలో చేరే అర్హత ఉందని ఆయన అన్నారు. మంత్రి వర్గంలో చేరాలని రాహుల్ ను చాలా సార్లు అడిగానని, పార్టీ కోసం పనిచేస్తున్నట్లు రాహుల్ చెబుతున్నారని ఆయన అన్నారు.

టెలికం వ్యవహారంలో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. సిబిఐని తాము రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అఫ్జల్ గురు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. మాయావతి నాయకత్వంలోని బిఎస్పీతో ఏ విధమైన ఒప్పందాలు లేవని ఆయన చెప్పారు. జనగణనలో కుల వివరాలు చేర్చే విషయంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. వారసత్వ సమస్యపై తాను ఆందోళన చెందడం లేదని, దానికి సంబంధించిన విషయంపై చరిత్రకారులు చెప్పాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X