వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై ఇప్పుడే చెప్పలేను: పిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. విజ్ఞాన్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ విధంగా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉందని, అందుకే నిపుణుల కమిటీ వేశామని ఆయన చెప్పారు. అన్ని విషయాలు నిపుణుల కమిటీయే చూసుకుంటుందని ఆయన అన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడగలనని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేసిన విషయం తెలిసిందే.

ఐపియల్ వివాదంలో ఇద్దరు కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించగా, దానిపై పార్లమెంటులో చర్చ జరిగిందని, ఆర్థిక మంత్రి వివరణ కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. హింసను మానితే జమ్మూ కాశ్మీర్ పై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అవినీతిని సహించబోమని, అవినీతికి పాల్పడినవారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు వచ్చేదంతా నల్లధనమేననే అభిప్రాయం ఉందని, రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై, ఖర్చులపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాలతో కలిసి నక్సల్స్ సమస్యను పరిష్కరిస్తామని, రాష్ట్రాలతో నక్సల్స్ సమస్యపై మాట్లాడుతూనే ఉన్నామని ఆయన చెప్పారు. నీటి సమస్యను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. తాను బలహీన పడితే ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X