వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ ప్రెస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajdhani Express Derailed
పాట్నా: గౌహతికి చెందిన రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు మంగళవారం ఉదయం బీహార్ లోని ఖారిక్, నౌగాచియా స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 11 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

న్యూఢిల్లీ నుంచి గౌహతికి వెళ్తుండగా మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని తూర్పు మధ్య రైల్వే సమాచార పౌర సంబంధాల ప్రధానాధికారి దిలీప్ కుమార్ చెప్పారు. ట్రాక్ పై పేలుడు శబ్దం వినిపించగానే డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేశాడని, పేలుడే రైలు పట్టాలు తప్పడానికి కారణమై ఉండవచ్చునని ఆయన అన్నారు. దీని వెనక కుట్ర ఉండవచ్చునని ఆయన అన్నారు. అయితే ఇందులో మావోయిస్టుల హస్తం లేదని పోలీసులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X