హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఐటి జెఇఇలో ఎపి విద్యార్థి ఫస్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

IIT JEE
హైదరాబాద్: ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జెఇఇ)లో రాష్ట్ర విద్యార్థుల హవా కొనసాగింది. ఓపెన్ కెటగిరీలో నారాయణ కళాశాలకు చెందిన జితేందర్ రెడ్డి ప్రథమ ర్యాంక్ సాధించాడు. మొదటి పది ర్యాంకుల్లో 2, 4, 8 ర్యాంకులను కూడా నారాయణ కాలేజీ విద్యార్థులు సాధించారు. శ్రీచైతన్య, నారాయణ, రామయ్య ఐఐటి సంస్థలు ఐఐటి జెఇఇలో ఎప్పటి లాగే మంచి ఫలితాలు సాధించాయి. మొదటి పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను రాష్ట్ర విద్యార్థులు సాధించారు.

ఉదయ్ షాకు రెండో ర్యాంక్, మధుకిరణ్ కు నాలుగో ర్యాంక్, కార్తిక్ కు ఆరో ర్యాంక్, సబరేష్ నిఖిల్ కు ఎనిమిదో ర్యాంక్ లభించాయి. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన జెఇఇకి 4 లక్షల 70 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 80 వేల మంది ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X