హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు ధైర్యవచనాలు ఫలించేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: పార్టీ నుంచి కళా వెంకటరావుతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంత మంది నాయకులు వెళ్లిపోయిన నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధైర్యం నూరిపోసే ప్రయత్న చేశారు. శ్రీకాకుళం జిల్లా నేతలతో ఆయన మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అధైర్య పడవద్దని ఆయన సూచించారు. సీనియర్లు పార్టీలో ఇతరులను ఎదగనీయలేదని ఓ మెలిక పెట్టారు. కొత్త నేతలతో పార్టీ జవసత్వాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్నవారు చాలా మంది ఉన్నారని, వారందరితో పార్టీని పునర్నిర్మిద్దామని ఆయన చెప్పారు. పార్టీకి అభిమానులు, కార్యకర్తల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతున్న ప్రతిసారీ చెప్పే మాటే మరోసారి చిరంజీవి చెప్పారు. అయితే, ఆయన మాటల మంత్రం ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. పార్టీని పునర్నిర్మించడానికి, దాని శక్తియుక్తులు అందించడానికి చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఏమీ లేవు. ఈ స్థితిలో ఆయన చెప్పే ధైర్యవచనాలు ఏ మేరకు పనిచేస్తాయనేది సందేహమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X