హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని రాష్ట్ర కాంగ్రెసు నాయకులు ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెసు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతిసారీ అదే జరుగుతోందని ఆయన అన్నారు. మూడు రోజుల పాటు జరిగే పార్టీ మహానాడును ఆయన గురువారం పార్టీ పతాకను ఆవిష్కరించి ప్రారంభించారు. రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వారసత్వాన్ని తమ పార్టీ స్వీకరించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెసు పార్టీ దెబ్బ తీస్తోందని ఆయన విమర్సించారు.

ప్రాంతీయ పార్టీగా ఉంటూనే తమ పార్టీ జాతీయ స్థాయిలో ప్రధాన పాత్ర పోషించిందని, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో తమ పార్టీ చురుకైన పాత్ర నిర్వహించిందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తమ పార్టీ ప్రతిపక్ష పాత్ర నిర్వహించిందని ఆయన చెప్పారు.

తాము ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలను పరిష్కరించామని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలకు తమ పార్టీయే శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. ధరల పెరుగుదలకు ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X