మహబూబాబాద్ పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి
కాంగ్రెసు పార్టీ నాయకులపై రాళ్లతో దాడికి దిగిన సందర్భంలో కాల్పులు జరిగాయని అంటున్నారు. కాంగ్రెసు నాయకుల అంగరక్షకులు మాత్రమే కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లోనే ఆందోళనకారులు మరణించారనే వాదన వినిపిస్తోంది. శాసనసభ్యురాలు కొండా సురేఖ వర్గీయులు కాల్పులు జరిపారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
జగన్ యాత్ర నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను చెప్పినా వినకుండా జగన్ యాత్రకు బయలుదేరడం పట్ల ఆమె తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తాజా పరిస్థితిని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ సమీక్షిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. మహబూబాబాద్ కు కడప మనుషులు కూడా చేరుకున్నారు. వారు మహబూబాబాద్ రైల్వే స్టేషనులో మోహరించారు.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు తెలంగాణ వరంగల్ ముగ్గురు మృతి హైదరాబాద్ ys jagan congress telangana warangal 3 dead hyderabad
Story first published: Friday, May 28, 2010, 12:30 [IST]