వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ మా రక్తంపై నడిచి వస్తాడా: కె. చంద్రశేఖర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

 K Chandrashekhar Rao
హైదరాబాద్‌: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే మీ రక్తంపై నడిచి వస్తా, మీ గుండెల మీది నుంచి వస్తా అన్నట్లుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. జగన్ యాత్రపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ను హైదరాబాదులోనే ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేసు పెట్టాల్సింది జగన్ పై కాదని, డిజిపి గిరీష్ కుమార్ పై అని ఆయన అన్నారు. మరోసారి వస్తానని అనడం జగన్ వలాధిపత్య అహంకార ధోరణి అని ఆయన అన్నారు. జగన్‌ శుక్రవారం తలపెట్టిన ఓదార్పుయాత్ర నేపథ్యంలో తెలంగాణ ప్రజలు తాము ఏం చెప్పదల్చుకున్నదీ స్పష్టంగా చెప్పారని, తెలంగాణ సమాజం ఏం కోరుకుంటున్నదో మహబూబాబాద్‌లో చూశామన్నారు. అక్కడికి తెలంగాణవాదులందరూ వెళ్లారని, తెరాసకు చెందినవారు తక్కువగానే ఉన్నారన్నారు.

వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలపై మేం ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామని, ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి కారణంగా శుక్రవారం తొమ్మిది మంది తెలంగాణవాదులకు బుల్లెట్‌గాయాలయ్యాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కొండా మురళీనే కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారని, ఎవరు కాల్పులు జరిపారన్నది ప్రభుత్వం తేల్చిచెప్పాలని, జరిగిన ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన అన్నారు. మహబూబాబాద్‌లో కొండ వర్గీయులే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తెలంగాణవాదులపై దాడిచేశారని, దీన్ని అడ్డుకునే క్రమంలో తెలంగాణవాదులు ప్రతిదాడికి దిగారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X