వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటో ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Rangareddy Dist
చేవెళ్ల: రంగారెడ్డి చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆటో బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

జిల్లాలో నిన్న జరిగిన రెండు సంఘటనల్లో ఇద్దరు మరణించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ ఐ కృష్ణయ్య కథనం ప్రకారం.. మహేశ్వరం నివాసి జోర్ల మల్లేష్‌ పాల వ్యాపారి. శుక్రవారం రాత్రి కందుకూరు మండలం కొత్తూరు నుంచి స్వగ్రామానికి మోటార్‌ సైకిల్‌ పై వస్తుండగా హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో మల్లేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్‌ పై నుంచి ఓ బాలుడు పడి మృతి చెందాడు. గండేడ్‌ మండలం నంచర్లలో 'ఉపాధి' పనుల్లో కూలీలు చెరువులో ఒండ్రుమట్టిని పొలాలకు తరలిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బాల్‌ రెడ్డి శనివారం ట్రాక్టర్‌ ఒండ్రుమట్టిని తీసుకొని పొలాలకు వెళుతుండగా మార్గమధ్యంలో ఆనంద్‌ (14) ఎక్కాడు. అది కదలడంతో ఆ బాలుడు దాని కింద పడి నలిగి పోయాడు. బాలుని పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తమ కొడుకు మృతికి తట్టుకోలేక తండ్రి చంద్రయ్య, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X