వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక బస్సు ప్రమాదంలో 30 మంది మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Karnataka Bus Accident
బెంగుళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చల్లనకేరి వద్ద కర్ణాటక రోడ్డు రవాణాసంస్థకు చెందిన బస్సు వంతెనను ఢీకొని బోల్తాపడటంతో 30మంది చనిపోయారు. బోల్తాపడిన వెంటనే బస్సు డీజిల్ ట్యాంకు మంటలు అంటుకున్నాయి. బస్సులో మంటలు ఏర్పడటంతో ప్రయాణీకులు చనిపోయినట్టు ససమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన 28 మందిని ఆసుపత్రికి తరలించారు.

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున రెండున్నరకు ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు సురాపార నుంచి బెంగళూరుకు చేరుకోవలసి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 10 మంది పిల్లలతో సహా 64 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని కర్ణాటక రవాణాశాఖ మంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X