వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలనకు కేంద్రం ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

MOH Farooq
న్యూఢిల్లీ: జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ పరిస్థితిపై గవర్నర్ ఫరూఖ్ సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ నివేదికపై రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మంగళవారం చర్చించింది. సోమవారం సాయంత్రం జార్ఖండ్ పరిస్థితిపై, ఫరూఖ్ పంపిన నివేదికపై కేంద్ర హోం మంత్రి చిదంబరం యుపిఎ చైర్ పర్సన్ సోనియాకు వివరించారు. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనకు దారి తీసింది.

కోత తీర్మానాలపై యుపిఎ ప్రభుత్వానికి మద్దతుగా శిబూ సోరేన్ ఓటు వేయడంతో జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. సొరేన్ వైఖరిపై మండిపడిన బిజెపి ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధపడింది. అయితే, తదుపరి చర్చల్లో ఓ రాజీ ఫార్ములా కుదరడంతో రొటేషన్ పద్ధతిపై బిజెపి, జెఎంఎం అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి శిబూ సొరేన్ నిరాకరించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో బిజెపి సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

శాసనసభలో బల నిరూపణ చేసుకోవాల్సిన స్థితిలో సొరేన్ ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ స్థితిలో గవర్నర్ అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X