ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ రంగులు!
రాధాకృష్ణపై సూర్య పత్రిక ప్రచురించిన కథనంలోని ఒక పేరాను చదవండి. "సైకిల్ చైన్ తెగితే ఆ గ్రీజును తుడుచుకోవడానికి తన ఛాంబరుకు వచ్చే వాడని స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్యనే స్పష్టం చేశారు. అలాంటి రాధాకృష్ణ ఒక్కసారిగా తాను పనిచేసిన పత్రికకు ఎలా యజమాని అయ్యాడు? అందుకు ఆయన వద్ద ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి? ఏడాది పొడవునా నీళ్లు ఉండే హైడల్ పవర్ ప్లాంట్కు యజమాని ఎలా అయ్యాడు? సొంత కొడుకు గుండెకు చిన్నతనంలో రంధ్రం పడితే నిమ్స్ జనరల్ వార్డులో చికిత్స చేయించిన ఈ ఆదర్శ మూర్తికి ఇప్పుడు డజన్ల కార్లు ఎక్కడివి? ఒక్క రాత్రిలో రిక్షాలు, ఆటోలు, బియ్యపు బస్తాలు, రక్తదానం చేసి కోట్లు సంపాదించడానికి ఆయనేమైనా తెలుగు సినిమాలో హీరోనా?..ఇలాంటి ప్రశ్నలకు 'దిగ్రేట్ బ్లాక్ మెయిల్" జర్నలిస్టు శ్రీమాన్ వేమూరి రాధాకృష్ణ ఎందుకు సమాధా నాలు ఇవ్వలేదో ప్రపంచానికి వెల్లడించవలసి ఉంది. అంటే ఇతరులకే తప్ప తనకు 'ఆత్మశోధన" పనికిరాదని అర్ధం చేసుకోవాలా?- ఇదీ సూర్య కథనంలోని ఒక భాగం.