వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్దానిక సంస్ధల ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయభేరీ
పశ్చిమ బెంగాల్ కు చెందిన 81 పురపాలక, నగర పాలక సంస్థల్లో, తృణమూల్ పార్టీ 50 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెసు పార్టీలు చిత్తుగా ఓడాయి. కాగా వచ్చే ఏడాది జరుగనున్న శాసససభ ఎన్నికలకు సన్నాహకంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని మమతా బెనర్జీ పార్టీకి ఎనలేని ప్రజల ఆదరణ లభించింది. ఫలితంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీని ప్రజలు ఆదరిస్తారని మమతా విశ్వాసాన్ని ప్రజలు వమ్ము చేయలేదు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. తృణమూల్ పార్టీపై ప్రజలు అమితమైన నమ్మకం ఉంచారని చెప్పారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు.
మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ కాంగ్రెసు mamta banerjee trinamool congress west bengal kolkata congress
Story first published: Wednesday, June 2, 2010, 16:03 [IST]