హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై ఇప్పటికే చెప్పాం: సింఘ్వీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Abhishekh Singhvi
హైదరాబాద్‌: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రపై పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రపై కొత్తగా చెప్పేదేమీ లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఇది వరకు చెప్పిన విషయం తెలిసిందే.

ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి సాధించేందుకు వైయస్ జగన్ ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో సింఘ్వీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ కు సింఘ్వీ ప్రకటన శరాఘాతం లాంటిదే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X