వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓదార్పు యాత్ర వైయస్ జగన్ ఇష్టం: సిఎం రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాలా, వద్దా అనేది కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఇష్టమని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జగన్ చేపట్టబోయే ఓదార్పు యాత్రపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై తనకు ఏ విధమైన ఆలోచన లేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకైతే జగన్ ఓదార్పు యాత్రకు కాంగ్రెసు పార్టీ అనుమతి లేదని ఆయన చెప్పారు.

ఒకవేళ జగన్ ఓదార్పు యాత్ర చేస్తే భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం వైఖరి, తదనంతర పరిణామాలను జగన్ ఆలోచించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నట్లు తెలిసింది. జగన్ శ్రీకాకుళం ఓదార్పు యాత్రకు అనుకూలంగా కొందరు మంత్రులు మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణలో సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి వరంగల్ జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర వద్దని తాము చెప్పామని మంత్రులు అన్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్రలో అటువంటి పరిస్థితి లేదని, అందువల్ల జగన్ ఓదార్పు యాత్రకు అనుమతిస్తే పార్టీ పటిష్టమవుతుందని వారు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X