తెలంగాణ ఉప ఎన్నికలకు కెసిఆర్ వ్యూహ రచన
మొత్తం 12 స్థానాల్లోనూ కాంగ్రెసు పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెసు నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగే యోచనలో ఉంది. దీంతో ఉప ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పేట్లు లేదు. ఈ స్థితిలో ఆ రెండు పార్టీలను ఎదుర్కోవడానికి కెసిఆర్ పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెసు అభ్యర్థులను అడుగడుగునా అడ్డుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. నామినేషన్లు వేయకుండా తెలుగుదేశం, కాంగ్రెసు అభ్యర్థులను అడ్డుకుంటామని తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులు హెచ్చరించారు.
Comments
Story first published: Tuesday, June 8, 2010, 15:51 [IST]