హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ ఆర్టిస్టులపై దాడులు: సెల్వరాజ్ పై అనుమానాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: టీవీ ఆర్టిస్టులపై వరుస దాడులు బుల్లి తెర ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. మంగళవారం శ్రీధర్ వర్మ అనే ఆర్టిస్టుపై యాసిడ్ దాడి జరగ్గా, బుధవారం ఉదయం డింపుల్ పై దాడి జరిగింది. ఈ రెండు దాడులకు లింక్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీవీ సీరియల్ అవకాశాలు కోల్పోవడం వల్ల మనస్తాపానికి గురైన టీవీ ఆర్టిస్టు సెల్వరాజ్ ఈ దాడుల వెనక ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డింపుల్ మాట్లాడిన తీరు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. సెల్వరాజ్ మొగలి రేకులు, చక్రవాకం వంటి హిట్ సీరియల్స్ లో నటించాడు.

దాసరి పద్మ నిర్మిస్తున్న తూర్పు పడమర సీరియల్ లో సెల్వరాజ్ ను తీసేసి ఆ స్థానంలో శ్రీధర్ వర్మను హీరోగా ఎంపిక చేసుకున్నారు. అదే విధంగా ఆరాధన టీవీ సీరియల్ లోనూ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సెల్వరాజ్ తీవ్ర అసంతృప్తికి, అనహనానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. శ్రీధర్ వర్మపై దాడి జరిగిన వెంటనే ఆ దాడితో తనకు ఏ విధమైన సంబంధం లేదంటూ సెల్వరాజ్ ప్రకటన చేశాడు. తాను సెల్వరాజ్ పై ఫిర్యాదు చేయలేదని శ్రీధర్ వర్మ అన్నారు. అవకాశాలు రాలేదనే కోపంతో ఈ విధమైన దాడులు పాల్పడితే సహించరాదని సినీ నిర్మాత భరద్వాజ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాగా, ఈ దాడులపై మరో వాదన కూడా వినిపిస్తోంది. చౌకబారు ప్రచారం కోసం కూడా ఈ విధమైన దాడుల వ్యవహారాలు సాగుతుండవచ్చుననేది ఆ వాదన. సీరియల్స్ ను హిట్ చేయడానికి ఈ విధమైన ప్రచారాన్ని వాడుకుంటున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే, బుల్లి తెర రంగంలో ఆధిపత్యం కోసం కూడా ఇటువంటి దాడులు జరుగుతుండవచ్చునని అంటున్నారు. డింపుల్ పై జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X