హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికలు: కాంగ్రెసులో తెలంగాణ చిచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలంగాణలోని 12 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెసులో ప్రాంతాలవారీ చిచ్చు ప్రారంభమైంది. తెలంగాణ, సీమాంధ్ర నాయకుల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కావడం, తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడితే తప్ప ఈ ప్రాంతంలో తిరగలేని పరిస్థితి తెలంగాణ నాయకులు ఉండడం ఈ విభేదాలకు కారణం. ఉప ఎన్నికల్లో తెలంగాణ ఎజెండాపై పోటీ చేయకూడదని, తెలంగాణ ఊసెత్తకుండా కాంగ్రెసు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి చేసిన ప్రకటనతో చిచ్చు మొదలైంది.

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తమ పార్టీయేననే ప్రధాన నినాదంతో కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఉప ఎన్నికల్లోకి వెళ్లే ఉద్దేశంతో ఉన్నారు. ఈ పరిస్థితిలో అనంత వెంకటరామిరెడ్డి ప్రకటనపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సైతం గత ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని, తెలంగాణ కాంగ్రెసుతోనే సాధ్యమని చెప్పారని తెలంగాణ నాయకులు గుర్తు చేస్తున్నారు. అలా చెప్పకపోతే పప్పులు ఉడకవని తెలంగాణ నాయకులు ఖరాఖండిగా చెప్పుతున్నారు. కాంగ్రెసులో ప్రారంభమైన ఈ వివాదం ముదిరి పాకాన పడే వాతావరణమే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X